Chariot caught fire last night at Sri Lakshmi Narasimha Temple

Spread the love

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మంత్రి వెలంపల్లి

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని రథం గత రాత్రి అగ్నికి ఆహుతైయిన విష‌యం తెలిసిన వెంట‌నే దేవ‌దాయ శాఖ మంత్రి దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, జిల్లా ఎస్సితో ఫోన్ మాట్లాడారు…

స‌హ‌య‌క చ‌ర్యులు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మంత్రి ఫోన్‌ల్లో మాట్లాడారు..

విచార‌ణ అధికారిగా దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను నియ‌మించారు,,
ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, దేవ‌దాయ శాఖ అధికారుల‌తో పాటు పోలీసులు సంబంధిత అధికారుల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను అదేశించారు…

అంతే కాకుండా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున నిర్మాణానికి చ‌ర్యులు చేప‌ట్టాల‌ని దేవ‌దాయ క‌మిష‌న‌ర్‌కు మంత్రి సూచించారు…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *