రేపు ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి
![రేపు ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి](https://tanvitechs.com/wp-content/uploads/2020/09/ys-jagan.jpg)
రేపు ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా హోంమంత్రి అమిత్షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్షెకావత్ సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం కలుసుకుంటారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చిస్తారు.