వీరికిమాత్రమే 15000 వేలు! ఉచితబస్ శుభవార్త
ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు భారీ ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. సంక్షేమ కార్యక్రమాల అమలుకు కార్యాచరణను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్యాబవిష్యత్ను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజాగా వెలువడిన సమాచారం మేరకు, పాఠశాల విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం కింద రూ.15,000 నగదు సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు తల్లి పేరుతో ఈ సాయాన్ని పొందేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా తల్లుల ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
అలాగే వచ్చే నెల 15వ తేదీ నుంచి మహిళలకోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్టు కూడా ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రెండు పథకాలూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ‘అమ్మకు చేర్చిన బహుమతి’గా అభివర్ణించవచ్చు. ఇది విద్యా మరియు రవాణా రంగాలలో మహిళలకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.