Minister Mekapati Gautam Reddy Comments

Minister Mekapati Gautam Reddy Comments
Spread the love

వాస్తవాలే చెబుతాం…నిజాలే మాట్లాడతాం : పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

గతంలో ఈడీబీ ర్యాంకులు వచ్చిన విధానం వేరు..ఇప్పుడు వేరు

  • మొట్టమొదటిసారి సర్వే చేసి ఫలితాలిచ్చారు
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిచింది
  • గతంలో లాగా నెంబర్ వన్ ర్యాంకును పొరుగు రాష్ట్రాలతో పంచుకోలేదు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ అరుదైన అగ్రస్థానం దక్కింది
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన సర్వే లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది
  • కరోనా అనంతరం పరిశ్రమలు మళ్లీ గాడిన పడేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను సీఎం జగన్ కల్పించారు
  • సీఎం ప్రోత్సాహం… పరిశ్రమల శాఖ అధికారుల కృషితో రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం
  • కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించగానే లోకేష్ ట్వీట్ చూసి ఆశ్చర్యపోయాను
  • 10 వ తరగతి ఫలితాలు ప్రకటించిన రోజు నారాయణ స్కూల్ తరహాలో చేశారు..
  • మా వల్లే ర్యాంక్ వచ్చింది అని ప్రచారం చేసుకున్నారు
  • మేము అధికారంలోకి వచ్చే నాటికి పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయి
  • మా ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.4-5 వేల కోట్ల వరకు చెల్లించాం
  • రుణాల రీషెడ్యూల్ చేయడం ద్వారా 10 వేల ఎమ్ఎస్ఎమ్ఈలకు ఊపిరి పోశాం
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు.. అమాయకులు అని లోకేష్ అనుకుంటున్నారు
  • రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారు, చేస్తున్నారు
  • సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో మొదటి ర్యాంకు సాధించడంపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు?
  • గత ప్రభుత్వం 32 లక్షల కోట్ల ఒప్పందాలు చేశామని గొప్పగా చెప్పింది.. అందులో 50 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు
  • ‘కియా’ని తెచ్చినందుకు గత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ, 20 ఏళ్ళపాటు ప్రభుత్వం పెనాల్టీ కట్టేలా రాయితీలు పెట్టారు
  • పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారు
  • ఈడీబీ కోసం అసలు సర్వే, ప్రక్రియ మొత్తం 2019 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు జరిగింది
  • ఈ సమయంలో ఎవరి ప్రభుత్వం ఉంది?
  • ఇదంతా 7,800 మందితో కేంద్రం సర్వే జరిపింది
  • గతంలో ప్రభుత్వం ఎవరి ని సూచిస్తే వారినే సర్వే చేశారు..ఇప్పటిలా గతంలో ఎప్పుడూ సర్వే జరగలేదు
  • అది కూడా కేవలం 10 శాతం మాత్రమే సర్వే
  • పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కరికాల వలవన్, సుబ్రహ్మణ్యం జవ్వాదిలను ప్రశంసించిన మంత్రి గౌతమ్ రెడ్డి
  • ఏఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి… పరిశ్రమల అవసరాలకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నాం
  • పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
  • కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చింది
  • కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా వీడియోను మీడియాకు ప్రదర్శించి చూపించిన మంత్రి మేకపాటి
  • 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ప్రపంచంలో 157వ స్థానంలో ఉంది
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంస్కరణలు తీసుకురావాలని నాడు దిశానిర్దేశం చేశారు

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *