దేవాలయాల వివాదాలపై స్పందించిన బండి సంజయ్ కుమార్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

దేవాలయాల వివాదాలపై స్పందించిన బండి సంజయ్ కుమార్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
Spread the love

🔸తిరుమల డిక్లరేషన్ అంశం మీద నడుస్తున్న వివాదం, కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

🔸కలియుగ ప్రత్యక్ష దైవం.. కోట్లాది మంది భక్తుల విశ్వాసమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కేంద్రంగా జరుగుతున్న రాజకీయ, వివాదాస్పద పరిణామాలు చాలా బాధాకరం.

🔸మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదు.

🔸ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయి. వాటిలోని లోతుపాతుల్ని విచారించేది… శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది స్వామీజీలు, పీఠాధిపతులు, మతపెద్దలు. వీటిలో రాజకీయ నేతలు తలదూర్చడం భావ్యం కాదు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని, అనుచితంగా మాట్లాడం గర్హనీయం.

🔸మత విశ్వాసాలు, ఆచార, సంప్రదాయాల్లో రాజకీయ నేతలు కలగజేసుకుంటే…. రాజకీయ నేతల భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారు.

🔸సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు…. సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం…., మాట్లాడటం సరికాదు.

🔸ప్రభుత్వంలోని కొందరు నేతలు సంయమనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు.

🔸ప్రధాని మోదీపై, యూపీ సీఎం యోగిపై… కొందరు నేతలు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

🔸కొందరు నేతలు బాధ్యతను మరచి విమర్శలు చేయడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అంతర్వేదిలో రథం కాలిపోతే… చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం.

🔸దేశవ్యాప్తంగా హిందూ సమాజం స్పందిస్తున్నా… అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేసి, చర్యలు తీసుకోవాల్సిన నేతలు… మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: