మీకు చేతకాకపోతే తప్పుకోండి ప్రజలను ఎలా రక్షించుకోవాలి చంద్రబాబుకి తెలుసు

మీకు చేతకాకపోతే తప్పుకోండి ప్రజలను ఎలా రక్షించుకోవాలి చంద్రబాబుకి తెలుసు
Spread the love

టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో అక్రమ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఫైర్

జగన్ ప్రభుత్వం తమ అసమర్ధతను కప్పిపెట్టుకోవడానికే చంద్రబాబుపై అక్రమ కేసు నమోదు పెట్టారు

రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబుకి అపాదించాలని వైసీపీ నేతలు చూస్తున్నారు

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభాలడానికి చంద్రబాబే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు

కరోనాతో ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి టీడీపీ నేతలను మాత్రం అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు

కరోనా నియంత్రణపై ప్రభుత్వం చేతులెత్తేసిందని వైసీపీ ప్రజా ప్రతినిధులే చెబుతున్నారు

రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న జగన్ చీమకుట్టినట్లు కూడా లేదు

కర్నూలు టౌన్ పీఎస్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు నమోదు చేయడం దారుణం

మన దేశంలో, రాష్ట్రంలో బి1-617, బి1-618 రెండు స్ట్రెయిన్ల వైరస్ ఉందని సిసిఎంబి నిర్ధారించిందన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా ?

ప్రస్థుతం కొత్త స్ట్రెయిస్ ఎస్-440కె వైరస్ ఏ విధంగా అరికట్టాలో ఆలోచించి తగిన చర్యలు తీసుకోకుండా అసలు 440కె వైరస్ లేనేలేదని చెప్పడం వెనుక అంతర్యం ఏంటి ?

జాతీయ మీడియా మొత్తం ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుందని ఒక వైపు చెబుతోంది

ఏపీ నుండి 440కె వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని అక్కడి ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది

ముఖ్యమంత్రి జగన్ అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఉంది టీడీపీ సైనికులు

చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలి

మీకు చేతకాకపోతే తప్పుకోండి ప్రజలను ఎలా రక్షించుకోవాలి చంద్రబాబుకి తెలుసు

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *