అగస్టు 15 నుంచి 50,000 వరకున్న పంట రుణాల మాఫీ

Share this news

అగస్టు 15 నుంచి 50,000 వరకున్న పంట రుణాల మాఫీ

వ్యవసాయం పై చర్చించిన కేబినెట్. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై చర్చించిన కేబినెట్.
పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించిన కేబినెట్. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన కేబినెట్.


రుణ మాఫీ పై కేబినెట్ చర్చ :
రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్ ముందుంచిన ఆర్ధిక శాఖ.

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేశారు.
అగస్టు 15 నుంచి నెలాఖరు వరకు 50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశం. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *