మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పోలు అనసూయమ్మ గారి పార్దివ దేహానికి నివాళులు అర్పించిన BRS రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్ గారు

Share this news

నిడమానూరు మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పోలు అనసూయమ్మ గారి పార్దివ దేహానికి నివాళులు అర్పించిన BRS రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్ గారు

నాగార్జున సాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం, వెనిగండ్ల గ్రామం పిఎసిఎస్ చైర్మన్ కె.వి. రామారావు గారి మాతృమూర్తి మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పోలు అనసూయమ్మ గారు అనారోగ్యం కారణంగా మరణించారు. BRS రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్ గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి కొప్పోలు రామారావు గారిని, కొప్పోలు రంగారావు గారిని, కొప్పోలు సుధాకర్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో వెనిగండ్ల గ్రామ సర్పంచ్ మరియు మండల ఫోరమ్ అధ్యక్షులు పోలే డేవిడ్ గారు, ఏ.ఈ. కత్తుల జగన్ గారు, ఎంపీటీసీ ప్రమీల వెంకన్న గారు, దామోదర్ గారు, కట్టెబోయిన పాండురంగయ్య గారు, కట్టెబోయిన రవికుమార్ గారు, కట్టెబోయిన శ్రీనివాస్ గారు, BRS పార్టీ నాయకులు నల్లబోతు వెంకటేశ్వర్లు గారు తదితరులు పాల్గొన్నారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *