రూ.500కే గ్యాస్ సిలిండర్ మీకు వస్తుందా? రావట్లేదా? అసలేం జరిగిందంటే?
రూ.500కే గ్యాస్ సిలిండర్ – Will you get a gas cylinder for Rs. 500? Or not? What actually happened?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద అమలవుతున్న రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం గత కొన్ని నెలలుగా జాప్యం పాలవుతోంది. గడచిన మూడు నెలలుగా ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర రాయితీ ఖాతాల్లో జమ కాకపోవడంతో, లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ను పూర్తి ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

🔍 వివరాల్లోకి వెళితే…
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. ఈ పధకం లో భాగంగా వంట గ్యాస్ ధరను 500 రూపాయలకే పొందవచ్చు. అయితే, దీనికి ముందుగా లబ్ధిదారుడు పూర్తిగా సిలిండర్ ధర చెల్లించాలి. ప్రస్తుతానికి మార్కెట్లో గ్యాస్ ధర రూ.915గా ఉంది. ఆ తరువాత, రాష్ట్ర ప్రభుత్వం రూ.375, కేంద్రం రూ.40 మంజూరు చేసి మొత్తంగా రూ.415ను లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
⚠️ మూడు నెలలుగా సబ్సిడీ జమ కాకుండా పోవడం…
తాజా సమాచారం ప్రకారం, గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ జమ కానందున మహిళలు పూర్తిగా రూ.915ను ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి పేద కుటుంబాలకు తీవ్ర ఆర్థిక భారంగా మారింది.
📊 గణాంకాలు ఇదే చెబుతున్నాయి:
- రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు: 1.2 కోట్లు
- రాయితీకి అర్హులుగా గుర్తింపు పొందిన కుటుంబాలు: సుమారు 39.57 లక్షలు
- వార్షికంగా అందాల్సిన రాయితీ సిలిండర్ల సంఖ్య: 2 కోట్లు పైగా
- సబ్సిడీకి అవసరమయ్యే మొత్తం: రూ.855 కోట్లు
- నెలవారీగా అవసరమైన సబ్సిడీ బడ్జెట్: రూ.80 కోట్లు
👩🍳 వినియోగదారుల ఆవేదన
సబ్సిడీ రావడం లేదు. డబ్బు పడకపోవడంతో ప్రతి సారి పూర్తిగా రూ.915 చెల్లించాల్సి వస్తోంది. ఇది మాది లాంటి మధ్యతరగతి కుటుంబానికి చాలా భారంగా మారింది.
ఇలాంటి పరిస్థితులు అనేక కుటుంబాల్లోనూ కనిపిస్తున్నాయి. పేద కుటుంబాలు వంట గ్యాస్ కొనుగోలుకు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల తమ జీతాల్లో చాలా భాగాన్ని సిలిండర్లపై ఖర్చు చేయాల్సి వస్తోంది.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
🗣️ అధికారుల వివరణ
పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,
“నిధుల విడుదలలో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల జాప్యం జరిగింది. అయితే, తక్షణమే పెండింగ్ సబ్సిడీని విడుదల చేయాలని చర్యలు తీసుకుంటున్నాం. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.”
🧾 ఇది పూర్తిగా ప్రభుత్వ భాద్యత
ప్రజలకు ప్రకటించిన పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రత్యేకించి మహిళల సాధికారతను లక్ష్యంగా చేసుకున్న మహాలక్ష్మి పథకంలో ఇలాంటి జాప్యాలు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. సబ్సిడీని సకాలంలో విడుదల చేయకపోవడం పథకం ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తోంది.
📢 గమనిక: మీరు మహాలక్ష్మి గ్యాస్ రాయితీకి అర్హులా? లేదా మీకు సబ్సిడీ జమ అయ్యిందా? తెలుసుకోవాలంటే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ని సంప్రదించండి.