Free Power: 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. కేంద్రం సూపర్ స్కీమ్.. ఇలా దరఖాస్తు చేస్తే చాలు!

Share this news

Free Power: 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. కేంద్రం సూపర్ స్కీమ్.. ఇలా దరఖాస్తు చేస్తే చాలు!

దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం భారీ ఆదరణ పొందుతోంది. ఈ పథకం ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుని నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికే లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. విద్యుత్ బిల్లులను తగ్గించడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది.

300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకారం, ఈ పథకం కింద లబ్ధిదారులు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, 2026 డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు ఈ సదుపాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారీ సబ్సిడీ కూడా

సోలార్ ప్యానెల్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది.

1 కిలోవాట్ సోలార్ వ్యవస్థకు రూ.30 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. 2 కిలోవాట్ వరకు ఏర్పాటు చేస్తే 60 శాతం వరకు రాయితీ లభించగా, 2 నుంచి 3 కిలోవాట్ల వరకు 40 శాతం సబ్సిడీ అందుతోంది.

3 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది.

ఎవరు అర్హులు?

ఈ పథకం ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం రూపొందించబడింది.

సొంత ఇంటి పైకప్పు ఉన్న గృహ యజమానులు, రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా చేయాలి?

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మొబైల్ నంబర్, విద్యుత్ కనెక్షన్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.

అనంతరం అధికారులు పరిశీలించి అర్హత నిర్ధారిస్తే సబ్సిడీతో కూడిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

అదనపు ఆదాయం కూడా

సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఇంటి అవసరాలకు మించి మిగిలిన కరెంట్‌ను డిస్కంలకు విక్రయించవచ్చు.

దీంతో విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా ప్రతి నెలా అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *