June 1, 2026 New Rules: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ నుంచి కొత్త రూల్స్..? LPG కనెక్షన్లపై భారీ మార్పులు!
June 1, 2026 New Rules: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు కీలక మార్పులు రానున్నాయనే చర్చ జరుగుతోంది. ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్ వినియోగదారులను ప్రభావితం చేసే పలు కొత్త నిబంధనలు జూన్ 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా PNG కనెక్షన్లు, LPG సరెండర్, OTP డెలివరీ, KYC నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం LPG సరఫరా మరియు పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు 2026ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం PNG (Piped Natural Gas) వినియోగాన్ని పెంచడం, LPGపై ఆధారపడటాన్ని తగ్గించడం. దీంతో నగర ప్రాంతాల్లో PNG కనెక్షన్లు ఉన్నవారికి కొత్త నిబంధనలు వర్తించే అవకాశం ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం PNG కనెక్షన్ తీసుకున్న తర్వాత 30 రోజుల్లోపు LPG కనెక్షన్ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో PNG సౌకర్యం లేని ప్రాంతానికి మారితే మళ్లీ LPG కనెక్షన్ పొందేందుకు Transfer Voucher సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వం “One Household – One Gas Connection” విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఒకే ఇంటికి PNG, LPG రెండు కనెక్షన్లు ఉండకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గ్యాస్ కంపెనీలు ఇలాంటి వినియోగదారులను గుర్తించి హెచ్చరిక సందేశాలు పంపుతున్నట్లు సమాచారం.
మరో కీలక అంశం OTP ఆధారిత LPG డెలివరీ. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP రాకపోతే గ్యాస్ డెలివరీ పొందడం కష్టమవుతుంది. దీంతో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ విక్రయాలను అరికట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్యాస్ బుకింగ్ వ్యవస్థలో కూడా మార్పులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల గ్యాప్, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ తర్వాతే కొత్త సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లాక్-ఇన్ పీరియడ్లో మార్పులు వస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు KYC తప్పనిసరిగా కొనసాగనుంది. ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయని వినియోగదారులు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
అలాగే దేశవ్యాప్తంగా ఆన్లైన్ LPG బుకింగ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం దాదాపు 99 శాతం బుకింగ్లు డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మొబైల్ యాప్లు, వెబ్సైట్లు, UPI చెల్లింపుల ద్వారా బుకింగ్లను ప్రోత్సహిస్తున్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎథనాల్ ఆధారిత వంట స్టవ్ను కూడా పరిచయం చేశారు. LPG కంటే తక్కువ ఖర్చుతో పనిచేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.