తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితుల వేదన

Share this news

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితుల వేదన

మూసీ సుందరీకరణ బాధితులు తమ వేదనతో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు, అక్కడ వారికి భరోసా కల్పించిన ప్రముఖ నేతలు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి.

హైడ్రా కూల్చివేతల బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరి, తమ కష్టాలను బీఆర్ఎస్ నేతలకు వివరించేందుకు వచ్చారు. “ఎప్పుడు మా ఇళ్లను కూల్చేస్తారో అన్న భయంతో నిద్రలేకుండా జీవిస్తున్నాం,” అంటూ వేదన వ్యక్తం చేశారు.

బాధితుల ఆవేదన

“పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న మా ఇళ్లు కూలిపోతే, తట్టుకునే శక్తి మాకు లేదు. మా గుండె ఆగిపోతుంది. కంటిమీద కునుకు లేదు, మా బాధ ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి,” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నేతల భరోసా

“ఏ సందర్భం వచ్చినా, మా తలుపులు మీ కోసం తెరిచే ఉంటాయి. 24 గంటలు మా న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉంటుంది. మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మీకు మద్దతుగా నిలుస్తాం,” అంటూ హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి బాధితులకు ధైర్యం ఇచ్చారు.

ప్రభుత్వ నిరంకుశ చర్యల వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును బీఆర్ఎస్ పెద్దలకు వినిపించి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని చెప్పారు.

మా గోడు వినండి

“ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఈ కష్టాలు మన నాయకులకు తెలియజేసి, ఒక మార్గం చూపించాలని ఆశిస్తున్నాం,” అంటూ బాధితులు తెలిపారు


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *